Ration Shops: ఇక రోజంతా రేషన్‌ సరఫరా

WhatsApp Group Join Now

రేషన్‌ దుకాణాలు మినీమాల్స్‌గా మారనున్నాయి – ఇక రోజంతా రేషన్‌ సరఫరా | Ration Shops

రేషన్‌ దుకాణాల పనితీరులో పెద్ద మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై చౌకధర దుకాణాలు రోజంతా తెరిచి ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ దుకాణాలను మినీమాల్స్‌గా మార్చి, రేషన్‌తో పాటు అన్ని రకాల నిత్యావసరాలను కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముందుగా పైలట్‌గా అమలు చేయడానికి రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను ఎంపిక చేశారు.

ప్రస్తుతం రేషన్‌ దుకాణాలు నెలలో 1 నుంచి 15 వరకు మాత్రమే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కొందరు డీలర్లు సమయానికి దుకాణాలు తెరవకపోవడం లేదా పూర్తిస్థాయి సేవలు అందించకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త విధానంలో రోజుకు సుమారు 12 గంటలు దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.

Pravasandhra Bharosa
Pravasandhra Bharosa: రూ 10 లక్షల భీమా, ఏపీ ప్రభుత్వం మరో పథకం- అర్హతలు..!!

మినీమాల్స్‌ రూపంలో పనిచేసే ఈ దుకాణాలకు జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్‌ సొసైటీ, గిరిజన కార్పొరేషన్‌ వంటి సంస్థల నుంచి నిత్యావసరాలు సరఫరా చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా డీలర్లే కొనాలా, రాయితీలు ఎలా ఉండాలి అనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది.

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక్కో నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను ఎంపిక చేశారు. ఈ వారం లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై డీలర్లు రోజంతా దుకాణాల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే వారి ఆదాయం దెబ్బతినకుండా, రేషన్‌తో పాటు అన్ని నిత్యావసరాలను అందుబాటులో ఉంచే విధంగా మినీమాల్స్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

Ration Card New Rules 2025: అన్ని రేషన్ కార్డ్ దారులకు నెలకు ₹1000 సాయం – పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now
error: Content is protected !!
WhatsApp