AP Free Bikes Scheme 2025: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఉచితంగా బైకులు… దరఖాస్తు వివరాలు!

By Grama Volunteer

Published On:

Follow Us
AP Free Bikes Scheme 2025
WhatsApp Group Join Now

ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు ఇస్తున్నారు.. ఒక్కో బైక్ ధర రూ.1.07 లక్షలు | AP Free Bikes Scheme 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర మోటార్ బైకులు అందించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 మందికి ఈ వాహనాలు లభించే అవకాశం ఉండగా, మొత్తం 1,750 మంది లబ్ధిదారులు ఉండనున్నారు. వీటిని హీరో కంపెనీ తయారు చేసిన 125 సీసీ సామర్థ్యమున్న త్రిచక్ర వాహనాల రూపంలో అందిస్తారు. ఒక్కో వాహనం మార్కెట్ విలువ రూ.1.07 లక్షలు అయినప్పటికీ, ప్రభుత్వం పూర్తిగా రాయితీతో ఉచితంగా ఇవ్వనుంది.

వాహనాల సరఫరా కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. విజయవాడలోని ఆర్‌ఎం మోటార్స్ ఈ పంపిణీని చేపట్టనుంది. మొదటి దశలో 875 మందికి వాహనాలు అందించేందుకు సుమారు రూ.9.44 కోట్ల నిధులు కేటాయించగా, రెండో దశలో మిగిలిన వారికి వాహనాలు ఇవ్వనున్నారు. ఈ పథకానికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండే వారు, కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగినవారు అర్హులు. గతంలో ఇలాంటి వాహనం పొందకపోవడం తప్పనిసరి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

AP Housing Scheme 2025
AP Housing Scheme 2025: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. దసరాకు మరో గుడ్ న్యూస్.!

దరఖాస్తు చేసుకునే వారు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సి సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికేట్, ఫోటో, విద్యార్థులైతే బోనఫైడ్ సర్టిఫికేట్ సమర్పించాలి. అన్ని వివరాలు సరిగా ఇచ్చారని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు వ్యక్తిగత వాహనం లభించడం వలన ఉద్యోగం, విద్య, వ్యక్తిగత అవసరాలను సులభంగా నిర్వహించగలరు. స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

Deepam 2 Scheme AP 2025
Deepam 2 Scheme AP: ఏపీలో ఇకపై వారికి కూడా ఉచితంగా సిలిండర్లు ఇస్తారు.. 23,912మందికి లబ్ధి
WhatsApp Group Join Now

WhatsApp Channel